1950 నుండి, ప్రతి సంవత్సరం జనవరి 26 తేదీన భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1950 సంవత్సరంలో ఇదే రోజున భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఇక్కడ గమనించవలసిన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారతదేశానికి ఆగస్టు 15, 1947 న బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్రం లభించింది, దీనిని భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే, 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని తొలిసారిగా ఆమోదించారు. కానీ, ఈ పెద్ద దేశం యొక్క ఏకీకరణ మరియు అనేక రకాల సాంస్కృతిక వైవిధ్యాలను ఏకం చేయడం అనేది, జనవరి 26, 1950 అంటే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే వరకు జరగలేదు.
భారతదేశంలో గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత
భారత రాజ్యాంగం అనేది భారత ప్రభుత్వం మరియు భారత పౌరుల విధానాలు, అధికారాలు, విధులు, ప్రాథమిక హక్కులు మరియు నిర్దేశక సూత్రాలను నిర్దేశించే ఒక భారీ డాక్యుమెంట్. భారత రాజ్యాంగం యొక్క పాలక సూత్రం ఏమిటంటే “
ప్రజల యొక్క, ప్రజల చేత మరియు ప్రజల కొరకు”, ఇది పూర్తి అధికారం భారత పౌరుల చేతుల్లో ఉందని సూచిస్తుంది. రిపబ్లిక్ డే అనేది తమ స్వంత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్న భారతీయ పౌరుల సాధికారత వేడుకను తెలియజేస్తుంది. ఇది భారత రాజ్యాంగ స్థాపన విధానాన్ని గుర్తుచేసే ఒక జాతీయ సెలవుదినం.
భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
- నేడు రిపబ్లిక్ డే పరేడ్ అనేది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఢిల్లీలోని ప్రజలు రాజ్పథ్లో జరిగే ఈ పరేడ్లో తప్పకుండా పాల్గొంటారు. చల్లని వాతావరణాన్ని లెక్కచేయకుండా, ఢిల్లీ వాసులు భారీ సంఖ్యలో ఈ అందమైన దృశ్యాన్ని వీక్షించడానికి వేలల్లో తరలివస్తారు.
- భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేస్తారు మరియు వీరులైన భారత పౌరులకు - పరమ వీర చక్ర, వీర చక్ర, అశోక్ చక్ర, కీర్తి చక్ర సాహస పురస్కారాలను మరియు జాతీయ సాహస బాలల పురస్కారాలను అందజేస్తారు
- యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు భారత ప్రధాని నివాళులు అర్పిస్తారు. అమర జవాన్లకు నివాళులు అర్పించడానికి ప్రధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దనున్న అమర్ జవాన్ జ్యోతి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తారు.
- గణతంత్ర దినోత్సవ పరేడ్కు భారత సాయుధ దళాల మూడు విభాగాలు – నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు భారత సైన్యం నాయకత్వం వహిస్తాయి. అంతే కాకుండా, అనేక సాంస్కృతిక ప్రదర్శన, ర్యాలీ సైనికుల కవాతు, మిలిటరీ బ్యాండ్లు, ఎయిర్క్రాఫ్ట్ షోలు మరియు సైనిక వాహనాల పై అద్భుతమైన నైపుణ్యం మరియు సాహసాన్ని ప్రదర్శిస్తారు.
- భారతదేశంలోని పాఠశాలలకు ఈ రోజున సెలవు ఉంటుంది. కానీ, విద్యార్థులు పాఠశాలకు వచ్చి జాతీయ జెండాను ఎగురవేస్తారు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మరియు స్వీట్లు తింటూ ఈ జాతీయ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.
రిపబ్లిక్ డే పరేడ్ ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన కవాతుల్లో ఒకటి. ఢిల్లీలో జరిగే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల వైభవాన్ని కళ్లారా చూసేందుకు, ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రజలు ముఖ్యంగా ఈ సమయంలో భారతదేశాన్ని సందర్శిస్తారు. ఈ గొప్ప వేడుకను చూసేందుకు మీరు కూడా మీ టికెట్లను బుక్ చేసుకున్నారా? మీరు మీ ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేసుకున్నప్పుడు తగిన
ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ when you book your flight tickets so that you are financially secure when taking this memorable
trip with your family and friends.
రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
జీవితాంతం ఆనందించండి
చాలా మంచి కంపెనీ
అద్భుతం!!
ధన్యవాదాలు
నిజంగా ఇది ఒక మంచి కథనం!